తెలంగాణ సీఎం సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విరాళం

Related image

కోవిడ్-19 నివారణలో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హైదరాబాద్ జోన్ ఉద్యోగుల వేతనాన్ని రూ. 3,00,000/-ల చెక్కును తెలంగాణ సీఎం సహాయ నిధికి గాను గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు జోనల్ మేనేజర్ దివిశ్ దినకర్ అందచేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 178 మంది ఉద్యోగుల రెండు రోజుల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందచేశామని జోనల్ మేనేజర్ తెలిపారు.

కోవిడ్-19 నివారణలో భాగంగా తెలంగాణ టాక్స్ ప్రాక్టీషినర్స్ అసోసియేషన్, హైదరాబాద్ తరపున అసోసియేషన్ సభ్యుల కంట్రిభ్యూషన్ రూ.2,10,000/-ల చెక్కును తెలంగాణ సీఎం సహాయ నిధికి గాను గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు అసోసియేషన్ ప్రెసిడెంట్ రంగి నగేష్, సేక్రేటరీ, ఆర్.విట్టల్ అందచేశారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి టాక్స్ ప్రాక్టీషినర్స్ అసోసియేషన్ 110 మంది సభ్యుల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందచేశామని అసోసియేషన్ ప్రెసిడెంట్ రంగి నగేష్ తెలిపారు.

More Press Releases