తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 'మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్' విరాళం

Related image

కరోనా వైరస్ నివారణ సహాయక చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల కోసం తమ వంతు సాయంగా మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులు రమేష్ కుమార్ బంగా, పురుషోత్తం దాస్ మందానా, ఉమేష్ చంద్ అసావాలు మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అందజేశారు.

  • విపత్తు సమయంలో తోడ్పాటునివ్వండి

  • నియంత్రణే కరోనా నివారణకు ఏకైక మార్గం

  • వ్యాధి లక్షణాలు ఉన్నవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి

  • విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు వివరాలు తెలిపి ప్రభుత్వానికి సహకరించాలి

  • ఎవరి వివరాలు అయినా తెలిస్తే ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి

  • ఆపత్కాలంలో మీ తోడ్పాటు అన్నార్ధులకు అండ అవుతుంది

More Press Releases