ఇట్స్ ఓకే గురు" సినిమా నుంచి 'నిలవదే నిలవదే..' లిరికల్ సాంగ్ రిలీజ్

చరణ్ సాయి, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "ఇట్స్ ఓకే గురు". ఈ చిత్రాన్ని వండర్ బిల్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మణికంఠ ఎం రూపొందిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'నిలవదే నిలవదే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
'నిలవదే నిలవదే..' పాటను సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియక్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా..లక్ష్మీ ప్రియాంక ఫీల్ గుడ్ లిరిక్స్ రాశారు. సిద్ధార్థ్ మీనన్ ఆకట్టుకునేలా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'నిలవదే నిలవదే ..ఎదురుగా నా మది..తపన తెరచాటులో..తగని ఆరాటమే, రెండై ఉన్న ప్రాణాలే ఒకటయ్యాయిలా, నీతో ఉన్న కాలాలే మధురమే...' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.