పాయల్ రాజ్‌పుత్ 'వెంక‌ట‌ ల‌చ్చిమి' సినిమా ప్రారంభం

Related image

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్‌ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ఆరు భాషల్లో రూపొందనున్న  పాన్ ఇండియా చిత్రం 'వెంకట లచ్చిమి' చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగాయి.   రాజా,  ఎన్ఎస్ చౌదరి నిర్మాత‌లుగా, డైరెక్ట‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందనుంది. 

ఈ సంద‌ర్బంగా డైరెక్ట‌ర్ ముని మాట్లాడుతూ.. ‘‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా క‌థ అనుకున్న‌ప్పుడే పాయల్ రాజ్‌పుత్ స‌రిగ్గా స‌రిపోతార‌నిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెర‌కెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్  యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన‌ ఈ రివేంజ్ డ్రామా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం’’ అని అన్నారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘మంగ‌ళ‌వారం’ సినిమా త‌ర్వాత ఎన్నో క‌థ‌లు విన్నాను. న‌చ్చ‌క‌ రిజెక్ట్ చేశాను. డైరెక్ట‌ర్ ముని గారు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ క‌థ చెప్ప‌గానే చాలా న‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత నా పేరు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా స్థిర‌ప‌డిపోతుందేమో అన్నంత‌గా బ‌ల‌మైన స‌బ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవ‌ల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.’’ అని అన్నారు.

Payal Rajput
Venkata lachim
Tollywood

More Press Releases