నరుడి బ్రతుకు నటన రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది: సుధీర్‌బాబు

Related image

'భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు సినిమా పరిశ్రమను చిన్న చిత్రాలు, మీడియాం రేంజ్‌ చిత్రాలు కూడా ముందుకు నడిపిస్తాయి. నరుడి బ్రతుకు నటన ట్రైలర్‌ చూశాను. నాకు బాగా నచ్చింది' అన్నారు కథానాయకుడు సుధీర్‌బాబు. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘టీజీ విశ్వ ప్రసాద్ గారిని పదేళ్ల క్రితం కలిశాను. ఆయన అప్పటికి ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. ఈ మూవీ ట్రైలర్ చూశాను. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. నేను కృష్ణవంశీ చిత్రానికి, బాఘీ చిత్రాలకు ఆడిషన్స్ చేశాను. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. ఈ మూవీ చాలా కొత్తగా, రీఫ్రెషింగ్‌గా ఉండబోతోందనిపిస్తోంది. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి టీంను సపోర్ట్ చేయండి’ అని అన్నారు. 

 డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను టేకప్ చేసిన టీజీ విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సుదీర్ బాబు గారికి, శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. శివ, నితిన్ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీంకు థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 25న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ‘మేం మా దర్శకుడు రిషిని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ని చేశాం. షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి రిషి నాకు తెలుసు. ఈ మూవీ చిన్నగా స్టార్ట్ అయింది. ఏ రోజు జరిగిన షూట్‌ని ఆ రోజే ఎడిట్ చేసి మాకు చూపించేవాడు. ఆయన చాలా టాలెంటెడ్. కంటెంట్‌ను నమ్మి మా నిర్మాతలు చిత్రాన్ని నిర్మించారు. విశ్వ ప్రసాద్ గారి రాకతో ఈ ప్రాజెక్ట్ స్థాయి పెరిగింది. ప్రీమియర్లలో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

 నిర్మాత డా. సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమాను ప్రెజెంట్ చేస్తున్న విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా మూవీ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సుధీర్ బాబు గారికి థాంక్స్. రిషికి మంచి టాలెంట్ ఉంది. శివ చక్కగా నటించాడు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీని చూసి కంటెంట్ నచ్చి విశ్వ ప్రసాద్ గారు ముందుకు వచ్చారు. మేం ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెల్ప్ దొరికింది. అందుకే ఇక్కడి వరకు వచ్చాం. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

More Press Releases