ప్రణయగోదారి’ నుంచి ‘తెల్లారుపొద్దుల్లో’ పాట విడుదల

Related image

సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా సాయికుమార్‌ ఓ ముఖ్య పాత్రలో రూపొందుతున్న చిత్రం 'ప్రణయ గోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో  చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య  ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'తెల్లారు పొద్దుల్లో' అంటూ కొనసాగే ఓ లిరికల్‌ వీడియోను 
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నిర్మాత మాట్లాడుతూ 'ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఎంతో సహజంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ లవ్‌స్టోరీలో అన్ని అంశాలున్నాయి.  ఇటీవల మేము విడుదల చేసిన  గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. . ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను . ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నాయి. ధనుంజయ్,  అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం' అన్నారు. 

 శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి పాటను ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. దర్శక నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

More Press Releases