మంచు లక్ష్మీ "ఆదిపర్వం" విడుదలకు ముస్తాబు

Related image

మంచు లక్ష్మీ, ఎస్తేర్‌, శివ కంఠమనేని ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం 'ఆదిపర్వం'. ఆదిత్య ఓం కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రానికి సంజీవ్‌ మేగోటి దర్శకుడు.రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. 500 థియేటర్స్‌లో చిత్రాన్ని విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. 

ఈ  సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నాం' అన్నారు. 


More Press Releases