మీ ఊహకు మించి వుంటుంది: అర్జున్‌ సర్జా

Related image

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో  ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. అక్టోబర్ 11న చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ‘మా చిత్రం అక్టోబర్ 11న రాబోతోంది. దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని చిత్రాలు చూడండి. మా మూవీని కూడా చూడండి. ధృవ సర్జా ఈ చిత్రానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మళ్లీ కేడీ సినిమా కోసం వెయిట్ తగ్గాడు. నేను పేపర్ మీద కథ రాశాను. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా.. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా గ్యాప్ తరువాత ఇలాంటి ఓ కమర్షియల్ చిత్రం రాబోతోందని చెప్పగలను. వైభవి అద్భుతంగా నటించారు. టాప్ టెక్నీషియన్లంతా సినిమాకు పని చేశారు. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

హీరో ధృవ సర్జా మాట్లాడుతూ.. ‘మార్టిన్ టీంకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మామ అర్జున్ గారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. బయట ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. నా ఈ మూవీని చూడండి.. నాకు టాలెంట్ ఉందని అనుకుంటే ఆ తరువాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేదంటే వదిలేయండి. కానీ మీకు సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. అన్ని సినిమాలను చూడండి. టైం దొరికితే నా మూవీని కూడా చూడండి’ అని అన్నారు' ఈ కార్యక్రమంలో దర్శకుడు బి.గోపాల్‌, నిర్మాత ఉదయ్‌.కె.మెహతా, హీరోయిన్‌ వైభవి శాండిల్య తదితరులు పాల్గొన్నారు.

More Press Releases