వినూత్న కాన్సెప్ట్‌తో 'ఐ హేట్‌ మ్యారేజ్‌' ప్రారంభం

Related image

సుగి విజయ్‌, జుప్పీ భద్ర జంటగా రూపొందుతున్న చిత్రం  'ఐ హేట్‌ మ్యారేజ్‌' . పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో ఆర్య సినిమా పతాకంపై ఎం.దయానంద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. సుగి విజయ్‌, జుప్సీ భద్ర హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాస రాజు క్లాప్‌ నివ్వగా,   ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నయ్య, రచయిత, నిర్మాత విజయ్‌కుమార్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. చిత్ర సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకలు నచ్చే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. యూత్‌ఫుల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా  రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు వున్నాయి.    ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందరిని కడుపుబ్బ నవ్విస్తుంది' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించాం. ఏకధాటిగా డిసెంబర్‌ వరకు జరగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. రొటిన్‌కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్నిప్రేక్షకులకు అందించబోతున్నాం' అన్నారు. సుగి విజయ్‌, జుప్సీ భద్ర,  పృథ్వీ, ఆశ్రిత, లోహిత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: విజయ్.సి.కుమార్‌, సంగీతం: వరికుప్పల యాదగిరి, అడిషినల్‌ డైలాగ్స్‌: శ్రీనివాస్‌ తేజ, నిర్మాత: ఎం.దయానంద్‌, కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పరమేష్‌ రేణుకుంట్ల. 

More Press Releases