అక్టోబర్ 4న రాబోతోన్న ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అందరినీ ఆకట్టుకుంటుంది.. రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ

Related image

ప్రస్తుతం కొత్త కాన్సెప్టులనే ఆడియెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవ తరం తీస్తున్న చిత్రాలకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 

ఇది వరకు మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రానుందని ప్రకటించారు.

 అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్ 4న తప్పకుండా మిస్టర్ సెలెబ్రిటీ సినిమాను చూడండి’ అని కోరారు.

 పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.

More Press Releases