పేదల అభ్యున్నతే లక్షంగా పని చేస్తున్నాం; శ్రీలంక జర్నలిస్టులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Related image

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. శ్రీలంక దేశానికి చెందిన మీడియా నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న మీడియా మేనేజ్‌మెంట్‌పై రెండు వారాల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతినిధి బృందం తెలంగాణలో ఉంది. ప్రతినిధి బృందం పర్యటనను భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసింది. 


రాష్ట్రానికి వచ్చిన బృందానికి స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ఘనమైన సాంస్కృతిక చరిత్ర, సహజ వనరులు ఉన్నాయని అన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీల రంగంలోనూ రాష్ట్రం ముందంజలో ఉందిని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రం లో తమ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి అంత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని, పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను మంత్రి గారు వారికి వివరించారు. 


జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో వారు పర్యటించిన ప్రదేశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న MCRHRD సంస్థను ఆయన అభినందించారు.

డైరెక్టర్ జనరల్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ శశాంక్ గోయెల్ సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మీడియాలో సాంకేతిక రంగంలో కొత్త పరిణామాలు, ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల వల్ల ఎదురవుతున్న సవాళ్లపై సందర్శకులకు శిక్షణ ఇచ్చామన్నారు. శ్రీలంకకు చెందిన జర్నలిస్టులు తమకు లభించిన సాదర స్వాగతం మరియు ఆతిథ్యానికి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. శిక్షణా కార్యక్రమం ద్వారా తాము ఎంతో ప్రయోజనం పొందామని చెప్పారు. ఇది తమకు గొప్ప అనుభవం అని చెప్పారు. ఈ సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

     

     

More Press Releases