భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు 103వ జయంతి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు

Related image

హైదరాబాద్ జూన్ 28:: భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు 103 వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీవీ మార్గ్ లోని జ్ఞాన్ భూమిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై పీవీ ని ఘనంగా స్మరించుకున్నారు. 

జ్ఞాన భూమి ని సందర్శించి పీవీ నర్సింహా రావుకు ఘనంగా నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, హై కోర్ట్ జడ్జి NV శ్రవన్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కరే వేణుగోపాల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బీసీ కమీషన్ చైర్మన్ కృష్ణ మోహాన్ రావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణి దేవి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి కాటా, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ హనుమంత రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి కోదండ రామ్, వీ. హనుమంత రావు, తదితరులు ఉన్నారు.

     

     
     

   
     
   

More Press Releases