ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలి: సీఎం కేసీఆర్ ఆదేశం

Related image

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పీఏసీఏస్‌లకు నియమించిన పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీకాలం ముగుస్తున్నందున మూడు, నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించి, పీఏసీఏస్‌లకు కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

More Press Releases