Paleti Krishnaveni: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణికి రిమాండ్.. జైలుకు తరలింపు

- వెంకయ్యనాయుడు, నారా లోకేశ్ పై అసత్య ఆరోపణలు చేసిన కృష్ణవేణి
- 14 రోజుల రిమాండ్ విధించిన గురజాల కోర్టు
- గుంటూరు జైలుకు తరలించిన దాచేపల్లి పోలీసులు
వైసీపీ మహిళా కార్యకర్త, ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణికి గురజాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు.
కేసు వివరాల్లోకి వెళితే... ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అవమానించారంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై పాలేటి కృష్ణవేణి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అసత్య ఆరోపణలు చేస్తూ, ఒక సామాజికవర్గానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటూ ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన దాచేపల్లి పోలీసులు గురజాలలో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్ విధించారు.