Donald Trump: ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజును నష్టాల్లో ముగించిన స్టాక్ మార్కెట్లు

- 191 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 72 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.57 శాతం పతనమైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు
ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయి 77,414 వద్ద ముగిసింది. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 23,519 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (1.88%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.01%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.87%), టాటా మోటార్స్ (0.82%), నెస్లే ఇండియా (0.75%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.45%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.20%), మారుతి (-2.10%), ఇన్ఫోసిస్ (-2.07%).