Chandrababu Naidu: ఆర్థిక శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu Reviews APs Financial Status

  • ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ స్థితిగతులపై చర్చ
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో సమీక్ష
  • కేంద్రం నుంచి నిధులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు

  • రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, ఆర్థిక శాఖలో నెలకొన్న పరిస్థితులపై ఆయన చర్చించారు.
  • కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులపై అధికారులతో సమీక్షించారు. కేంద్రంలోని వివిధ శాఖల నుంచి రావలసిన నిధులు సత్వరం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
  • కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి, నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
  • కేంద్ర పథకాలకు సంబంధించి ఐదు శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలియజేశారు.
  • కేంద్రంతో సంప్రదింపులు జరిపి, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిధులు రాబట్టాలని చంద్రబాబు సూచించారు.
  • ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News