Krishna District: కృష్ణా జిల్లాలో దారుణం.. బాలికను నిర్బంధించి ఏడుగురు యువకుల సామూహిక లైంగికదాడి

- పక్కింటి మహిళతో కలిసి 9న వీరపనేనిగూడెం వచ్చిన బాలిక
- ఆమెతో వివాదం కారణంగా 13న ఇంటి నుంచి బయటకు వచ్చేసిన వైనం
- ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన బాలుడు, యువకుడు
- బైక్పై జి.కొండూరులో దింపుతామని నమ్మించి అఘాయిత్యం
- ఆ తర్వాత మరో ఐదుగురు యువకుల దారుణం
- అనంతరం ఆటోలో తీసుకెళ్లి మాచవరంలో వదిలేసిన వైనం
- బాలిక స్థితిని గమనించి ఆరా తీసి పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఆటో డ్రైవర్
కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో దారుణం జరిగింది. ఓ బాలికను నాలుగు రోజులపాటు బంధించిన యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక పక్కింటి మహిళతో కలిసి ఈ నెల 9న వీరపనేనిగూడెం వచ్చింది. అయితే, 13న ఓ వివాదం కారణంగా ఆ ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చేసింది.
బాలిక ఒంటరిగా బయటకు రావడాన్ని గమనించిన 15 ఏళ్ల బాలుడు, రజాక్ అనే మరో యువకుడు బాలిక వద్దకు వెళ్లి బైక్పై జి.కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అనిల్, జితేంద్ర అనే ఇద్దరు యువకుల వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆపై కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా నాలుగు రోజులపాటు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. సోమవారం ఆమెను ఆటోలో తీసుకొచ్చి మాచవరంలో వదిలిపెట్టారు.
ఆమె పరిస్థితి చూసి అనుమానించిన ఓ ఆటోడ్రైవర్ వివరాలు కనుక్కొని మాచవరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బాలికను అప్పగించాడు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.