వల్లభనేని వంశీపై కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ
- టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఇప్పటికే బెయిల్ నిరాకరించిన హైకోర్టు
- వంశీపై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న సీఐడీ
- కిడ్నాప్ కేసులో రేపటితో ముగుస్తున్న వంశీ రిమాండ్
మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో వంశీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో వంశీపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు.