స్థానిక, ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
- 11వ తేదీ శ్రీవారి దర్శనం కోసం నేడు తిరుపతి స్థానిక భక్తులకు టోకెన్ల పంపిణీ
- ఎన్ఆర్ఐ భక్తుల బ్రేక్ దర్శనాలను పెంపు చేసిన టీటీడీ
- 50 నుంచి 100కు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం
ఇక, తిరుమలకు వచ్చే ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ)కు ఇకపై రోజుకు వంద మంది వీఐపీ దర్శనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటి వరకూ రోజుకు 50 మంది ఎన్ఆర్ఐలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశం ఉండగా, ఆ సంఖ్యను వందకు పెంచారు. ఎన్ఆర్ఐ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ తాజా నిర్ణయంతో నిత్యం వంద మంది ఎన్ఆర్ఐలు తమ కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం సులభంగా చేసుకునే అవకాశం లభించింది. టీటీడీ నిర్ణయం పట్ల ఎన్ఆర్ఐ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ టీడీడీకి, పాలకమండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.