President Of India: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన రాష్ట్రపతి

- ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్
- మొత్తం 70 స్థానాలకు ఒకే విడత ఎన్నికలు
- పోలింగ్ బూత్ లకు క్యూ కట్టిన ప్రముఖులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ముర్ము ఓటేశారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా అన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.
ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు..
- రాష్ట్రపతి ఎస్టేట్లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము
- కె.కమ్రాజ్ లేన్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ
- రాజ్ నివాస్ మార్గ్ లో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
- కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ
- నిర్మాణ్ భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- తుగ్లక్ క్రెసెంట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన అర్ధాంగి
- ఆనంద్ నికేతన్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుటుంబం
- జన్ పథ్ లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్
- న్యూఢిల్లీ నియోజకవర్గంలో మనీశ్ సిసోడియా దంపతులు