Konda Surekha: కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడేందుకు మాటలు రావడం లేదు: కొండా సురేఖ

Completely disappointed with the Union Budget Konda Surekha  on Budget

  • బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కొండా సురేఖ
  • చిన్న రాష్ట్రమైన తెలంగాణకు తగిన కేటాయింపులు రాలేదని విమర్శ
  • తెలంగాణకు ఇచ్చిన హామీలు విస్మరించారన్న మంత్రి

2025-26 కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన చెందారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రమైన తెలంగాణకు నిర్మలా సీతారామన్ తగినన్ని నిధులు కేటాయించకపోవడం బాధాకరమని, ఈ విషయంలో మాట్లాడటానికి తనకు మాటలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News