Niti Aayog: 2022-23 ఆర్ధిక ఆరోగ్య డేటా విడుదల చేసిన నీతి ఆయోగ్

NITI Aayog releases economy data of 2022 and 23

  • ఏపీకి 17వ స్థానం
  • తెలంగాణకు 8వ స్థానం
  • పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల పరిస్థితి ఫర్వాలేదని వెల్లడి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా వ్యవహరించే నీతి ఆయోగ్ 2022-23 ఏడాదికి గాను ఆర్థిక ఆరోగ్య డేటా విడుదల చేసింది. 2022-23లో ఏపీ 17వ స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. ఆ ఏడాది ఏపీ ఆర్థిక ఆరోగ్య స్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2022-23లో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి బాగుందని వివరించింది. 

రాష్ట్రాల రెవెన్యూ సమీకరణ, వ్యయం, అప్పులు, చెల్లింపుల సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఈ నివేదికను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News