Telangana: ఒక అరటిపండు రూ.100 చెప్పిన హైదరాబాదీ వ్యాపారి.. ఆశ్చర్యపోయిన రష్యన్ యాత్రికుడు... ఇదిగో వీడియో

One Banana rs 100 in Hyderabad

  • హైదరాబాద్‌లో రష్యన్ యాత్రికుడికి వింత అనుభవం
  • ఒక అరటిపండు ఎంత అని తోపుడు బండ్ల వ్యాపారిని అడిగిన రష్యన్
  • ఎన్నిసార్లు అడిగినా ఒక అరటిపండు విలువ రూ.100 అన్న వ్యాపారి
  • అంత ధర చెల్లించలేనంటూ ముందుకు కదిలిన రష్యన్

మనం అరటిపండ్లను డజన్ లెక్కన కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం మార్కెట్లో డజన్ అరటిపండ్ల ధర రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో ఓ రష్యన్ యాత్రికుడికి వింత అనుభవం ఎదురైంది. ఓ తోపుడు బండ్ల వ్యాపారి ఒక అరటిపండు ధరనే అతనికి రూ.100గా చెప్పాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సదరు రష్యన్ యాత్రికుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో... రష్యన్ యాత్రికుడు తోపుడు బండ్ల వ్యక్తి వద్దకు నమస్కారం చెబుతూ వెళ్లాడు. ఒక అరటిపండు ఎంత అని అడిగాడు. దానికి ఆ వ్యాపారి రూ.100 అని చెప్పాడు. నేను ఒక్క అరటిపండు ధరను అడుగుతున్నానని పలుమార్లు ఆ రష్యన్ అడిగినప్పటికీ... వంద రూపాయలు అని ఆ వ్యాపారి కరాఖండీగా చెప్పాడు. అయితే అంత ధరను తాను చెల్లించలేనంటూ సదరు యాత్రికుడు అక్కడి నుంచి ముందుకు కదలడం వీడియోలో చూడొచ్చు. 

క్రేజీ ప్రైస్ అంటూ వీడియోలో అతను పేర్కొన్నాడు. ఈ ధరతో యూకేలో ఎనిమిది అరటిపండ్లు కొనుగోలు చేయవచ్చు.. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటే అంటున్నారని పేర్కొన్నాడు. నేను ఒకే అరటిపండుకు ధర అడిగిన విషయం సదరు వ్యాపారికి అర్థమైందనే అనుకుంటున్నానని ఆ రష్యన్ టూరిస్టు పేర్కొన్నాడు.

Telangana
Hyderabad
Russia

More Telugu News