Khammam District: ఖమ్మం జిల్లాలో క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలిన యువకుడు

Young boy died during cricket tournament

  • కూసుమంచి జిల్లాలో ఘటన 
  • మైదానంలో కుప్పకూలిన విజయ్ అనే యువకుడు
  • గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు

ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.

ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • Loading...

More Telugu News