BRS: ఆ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్

- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ పిటిషన్
- స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్న బీఆర్ఎస్
- నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని విజ్ఞప్తి
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పిటిషన్లో కోరింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ స్పీకర్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని అందులో పేర్కొన్నారు.
కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ని దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ విషయమై హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు అవుతున్నప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపింది.
ఈ సందర్భంగా గతంలో కేశం మేఘచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ప్రస్తావించింది. ఈ కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ప్రస్తావించింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.