Congress: భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

- ధ్వంసమైన ఫర్నీచర్, అద్దాలు
- రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యూత్ కాంగ్రెస్ ఆగ్రహం
- ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న కాంగ్రెస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.