Virat Kohli: ‘కింగ్ ఈజ్ డెడ్’.. కోహ్లీ దారుణ ఫామ్‌పై ఆర్సీబీ మాజీ కోచ్

Simon Katich Slams Virat Kohli

  • పెర్త్‌లో సెంచరీ తర్వాత వరుసగా విఫలమవుతున్న కోహ్లీ 
  • ‘కింగ్’ ఇప్పుడు బుమ్రా వశమైందన్న సైమన్ కటిచ్
  • ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 30 వికెట్లు పడగొట్టిన పేసర్

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం కావడంపై ఆర్సీబీ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ది కింగ్ ఈజ్ డెడ్’ అని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. అత్యంత కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఆ తర్వాతి నుంచి పేలవ బ్యాటింగ్‌తో విమర్శలు కొనితెచ్చుకున్నాడు. పెర్త్ టెస్టు సెంచరీ తర్వాత కోహ్లీ వరుసగా 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. 

కోహ్లీ ఫామ్‌పై కటిచ్ మాట్లాడుతూ.. ‘ది కింగ్ ఈజ్ డెడ్’ అని విమర్శించాడు. అతడు తబడుతున్నాడని, ‘కింగ్’ను ఇప్పుడు బుమ్రా తీసేసుకున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాడని, అది అతడికి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపాడు. ఈ సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 12.83 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడి 203 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిది, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. 

Virat Kohli
Australia
Cricket News
RCB
Simon Katich
  • Loading...

More Telugu News