ఆధారాలు లేకుండా ఈవీఎంలను నిందించలేం: సుప్రియా సూలే
- నాలుగుసార్లు ఈవీఎంల ద్వారానే గెలిచానన్న సుప్రియాసూలే
- అలాంటప్పుడు అందులో స్కాం ఉందని ఎలా చెబుతానని ప్రశ్న
- వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాలన్న సుప్రియా
ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే తాను నాలుగుసార్లు విజయం సాధించానన్నారు. అలాంటప్పుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని వ్యాఖ్యానించారు. ఆధారాల్లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేమన్నారు. ఈవీఎంలలో అవకతవకలపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో వాస్తవాలను బయటకు తీసుకువచ్చేలా చర్చ జరగాల్సి ఉందని సుప్రియాసూలే అభిప్రాయపడ్డారు.
ఓటర్ల జాబితాపై చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కాబట్టి ఈవీఎం అయినా... బ్యాలెట్ పేపర్ అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని తెలిపారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, ఈవీఎంలు కావాలనుకుంటే వాటినే ఏర్పాటు చేయాలన్నారు.