Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • 67 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 25 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.62 శాతం నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు... ట్రేడింగ్ చివర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 78,472కి పడిపోయింది. నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 23,727 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.92%), ఐటీసీ (0.86%), నెస్లే ఇండియా (0.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.62%), టీసీఎస్ (0.57%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.62%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.11%), టైటాన్ (-0.98%), టాటా స్టీల్ (-0.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.93%).

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News