విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్
- మోహన్ బాబు కుటుంబంలో కొనసాగుతున్న వివాదం
- తన అన్నపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసిన మనోజ్
- ఏడు అంశాలతో ఏడు పేజీల ఫిర్యాదు
ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు వర్గం, మనోజ్ వర్గం పోటాపోటీగా బౌన్సర్లను రంగంలోకి దింపడంతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో, తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. జర్నలిస్టులపై దాడితో మోహన్ బాబుపై కేసు నమోదైంది.
అటు, ఉద్రిక్తతలకు దారి తీసే ఎలాంటి చర్యలకు పాల్పవడవద్దంటూ మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంతలోనే మళ్లీ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదానికి ఇప్పట్లో ముగింపు పడదన్న విషయం అర్థమవుతోంది.