Sandhya Theater Stampade Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగుస్తున్న ఉచ్చు.. వెలుగులోకి షాకింగ్ ట్విస్ట్!

- నటీనటులు వచ్చేందుకు అనుమతి కోరిన సంధ్య థియేటర్ యాజమాన్యం
- థియేటర్ ఉన్న పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని పోలీసుల రిప్లై
- నటీనటులు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుందన్న పోలీసులు
- అయినా ఆ విషయం దాచిపెట్టి నటులను రప్పించిన యాజమాన్యం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్చార్జ్ గంధకం విజయ్ చందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చారు.
తాజాగా, ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రీమియర్ షో సందర్భంగా నటీనటులు థియేటర్కు వస్తున్న విషయాన్ని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినపతిపత్రం ద్వారా తెలియజేస్తూ అనుమతి కోరింది. అయితే, పోలీసులు ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ థియేటర్ యాజమాన్యానికి పంపిన లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

