మహిళా కమాండో కాదు.. ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
- ప్రధాని మోదీ వెనక మహిళా ఆఫీసర్ ఫొటో వైరల్
- ప్రధాని భద్రతా సిబ్బందిలో తొలి మహిళా కమాండో అంటూ ప్రచారం
- ఎంపీ కంగనా రనౌత్ షేర్ చేసిన ఫొటోతో ఊహాగానాలు
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)
ఇందిరా గాంధీ హత్య జరిగిన తర్వాత ప్రధాని, వారి కుటుంబాల భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)’. 1985లో ఎస్పీజీ ఏర్పాటైంది. ప్రధానితో పాటు ఆయన/ ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేది. అయితే, రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు, వారి ఫ్యామిలీలకూ ఎస్పీజీ భద్రత కల్పించేలా సవరణ చేశారు. అయితే, 2019లో ఎన్డీయే హయాంలో దీనికి సవరణలు చేసి కేవలం ప్రస్తుత ప్రధానమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే భద్రత కల్పించేలా మార్చారు.