KTR: రాజకీయాల్లో రాక్షస క్రీడలు మానేయండి: కేటీఆర్

KTR fires on state govt over farmers issues

  • దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా అంటూ కేటీఆర్ ఫైర్
  • రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదంటూ ప్రశ్న
  • రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు

దసరా పండగకే కాదు... దీపావళి వేళ కూడా రైతులను దివాలా తీయిస్తారా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. రాజకీయాలపై చూపిస్తున్న శ్రద్ధ... ధాన్యం కొనుగోలుపై ఎందుకు చూపించరు? రైతులంటే ఎందుకంత చిన్నచూపు? మీ గారడీ హామీలు నమ్మి మోసపోతున్నందుకా? అని ప్రశ్నించారు. 

రాజకీయాల్లో రాక్షస క్రీడలు ఆపేసి రైతులను ఆదుకోవడంపై దృష్టి సారించండి అని కేటీఆర్ హితవు పలికారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా... ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు రావడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News