Free Sand: ఇసుక పూర్తిగా ఉచితమని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు: మంత్రి పార్థసారథి

AP Minister Parthasarathy clarifies on Sand Policy

  • ఏపీలో ఇసుకను పూర్తి ఉచితం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • వైసీపీ నేతల ప్రచారాన్ని నమ్మవద్దన్న మంత్రి పార్థసారథి
  • ఇసుక కావాల్సిన వారు సొంత వాహనాల్లో తీసుకెళ్లవచ్చని వెల్లడి

ఇసుక అంశంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఇసుకపై వైసీపీ నేతలు చేసే ఆరోపణలను నమ్మవద్దని అన్నారు.  ఇసుక పూర్తిగా ఉచితమని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. వైసీపీ నేతల ఆరోపణలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. 

ఇసుక కావాల్సిన వారు సొంత వాహనాల్లో తీసుకెళ్లవచ్చని, ఇసుక తవ్వకాల ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఉచిత ఇసుకను దారిమళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పార్థసారథి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News