Seethakka: సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మహారాష్ట్రలో... భట్టి విక్రమార్కకు ఝార్ఖండ్ లో... ఏఐసీసీ కీలక బాధ్యతలు

Uttam Seethakka among 11 Congress leaders appointed as AICC senior observers for Maharashtra Assembly polls

  • మహా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా నియమించిన ఏఐసీసీ
  • ఝార్ఖండ్‌ లో పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ

తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.

మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియమించగా... ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక, ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు.

  • Loading...

More Telugu News