Guntur District: గుంటూరు జిల్లాలో కుంగిన రైల్వే ట్రాక్... తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్‌కు అంతరాయం

Railway track near machavaram damaged

  • భారీ వర్షాలతో మాచవరం వద్ద కుంగిన రైల్వే ట్రాక్
  • రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు
  • తిరుపతి-సికింద్రాబాద్ రైలును వెనక్కి మళ్లించిన అధికారులు
  • ఆ తర్వాత మూడో లైన్ ద్వారా సికింద్రాబాద్‌కు బయలుదేరిన వందేభారత్

తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు ఇబ్బందులు ఎదురవడంతో అధికారులు ఆ రైలును వెనక్కి రప్పించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ట్రాక్ కుంగిపోయింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

తిరుపతి-సికింద్రాబాద్ రైలును అధికారులు వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ సికింద్రాబాద్‌కు బయలుదేరింది. విజయవాడ-చెన్నై మార్గంలోనూ పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News