Chandrababu: ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెంటివ్

CM Chandrababu reviews on industrial development

  • ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పై చంద్రబాబు సమీక్ష
  • అధికారులకు దిశానిర్దేశం 
  • పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అధికారులు

సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడుదారులను ఆకర్షించి.... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు ఉండాలని చంద్రబాబు అన్నారు.

ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మిగిలిన మూడు పాలసీలను వచ్చే క్యాబినెట్ ముందుకు తీసుకువచ్చేందుకు ఈ సందర్భంగా నిర్ణయించారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు.

దాదాపు 7-8 శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం... వీటి రూపకల్పనపై మూడు నెలలుగా కొత్త కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా అధికారులు పాలసీలు రూపొందించి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వీటిపై సిఎం లోతుగా చర్చించి సమీక్ష నిర్వహించారు. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్నారు.

ఈ సమీక్షలో అధికారులు ఆయా పాలసీలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రతిపాదించనట్లు తెలిపారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ విధానాలను రూపొందించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ....దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా కంపెనీలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెన్టివ్ లు దక్కుతాయని...ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.

త్వరితగతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయని....ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను, విధివిధానాలను సమగ్రంగా స్టడీ చేసి.....నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక కుటుంబం...ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్ తో ఎంఎస్ ఎంఈ పాలసీ ఉండాలని.. అది కూటమి ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News