Pawan Kalyan: బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్‌

Deputy CM Pawan Kalyan Visits Indrakeeladri

  • కూతురు ఆద్య‌తో క‌లిసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న జ‌న‌సేనాని
  • ఆయ‌న‌తో పాటు దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న‌ మంత్రి అనిత‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్ 
  • నేడు మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో స‌రస్వ‌తీదేవీ అలంకారంలో అమ్మవారు 

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు కుమార్తె ఆద్య‌తో క‌లిసి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ త‌ర్వాత తీర్థ‌ప్ర‌సాదాలు, అమ్మ‌వారి చిత్రప‌టం అంద‌జేశారు. 

ఉప ముఖ్య‌మంత్రితో పాటు హోంమంత్రి అనిత‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్ కూడా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఇవాళ మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో స‌రస్వ‌తీదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. 

  • Loading...

More Telugu News