Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కూతురు స్థలంలో మరోసారి నిర్మాణాల కూల్చివేత

Deomolition works in Vijayasai Reddy daughters land

  • భీమిలిలో విజయసాయి కూతురుకు 4 ఎకరాల స్థలం
  • నిర్మాణాలను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు
  • ఈరోజు మరోసారి కూల్చివేతలను చేపట్టిన జీవీఎంసీ

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కట్టడాలు ఉన్నాయి. సుమారు 4 ఎకరాలు ఉన్న ఈ ఆక్రమిత స్థలంలో అక్రమ కట్టడాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ ఆక్రమణలపై ఇటీవలే ఏపీ హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిల్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో 2 వారాల క్రితమే జీవీఎంసీ అధికారులు నిర్మాణాల తొలగింపును చేపట్టారు. తాజాగా ఈరోజు మరోసారి కూల్చివేతల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News