KTR: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ కమిటీ వేసిన కేటీఆర్

KTR constitute committee on hospitals

  • రాజయ్య నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ
  • కమిటీలో రాజయ్యతో పాటు డాక్టర్ సంజయ్, డాక్టర్ ఆనంద్
  • ఆసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు దిగజారిపోయాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురితో పార్టీ కమిటీని నియమించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులను ఈ బీఆర్ఎస్ కమిటీ సందర్శించి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రాజయ్యతో పాటు డాక్టర్ సంజయ్, డాక్టర్ ఆనంద్ మెతుకు ఉన్నారు.

ఈ మేరకు బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై బీఆర్ఎస్ ఒక నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటనను విడుదల చేశారని వెల్లడించింది.

పార్టీ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఉంటారని ఆ ట్వీట్ లో పేర్కొంది.

డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ... గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని వివరించింది.

  • Loading...

More Telugu News