Nara Lokesh: మంగళగిరిలో కరెన్సీ గణేశుడికి మంత్రి నారా లోకేశ్ పూజలు

Nara Lokesh visits Ganesh Pandal in Mangalagiri

  • కొనసాగుతున్న వినాయకచవితి నవరాత్రులు
  • మంగళగిరిలో మెయిన్ బజార్ వద్ద గణేశ్ మండపం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యులు
  • రూ.2.3 కోట్ల కరెన్సీ నోట్లతో విగ్రహాలంకరణ
  • తొలి హారతి ఇచ్చిన నారా లోకేశ్

వినాయకచవితి నవరాత్రులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు చేశారు. 

ఈ మండపంలోని వినాయక విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణేశుడిని రూ.2.3 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ గణేశ్ మండపాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్... గణలక్ష్మి, గణనాథుడికి తొలి హారతి ఇచ్చారు. ఈ గణేశ్ విగ్రహాన్ని మంగళగిరికి చెందిన ఆర్య వైశ్య సంఘాలు ఏర్పాటు చేశాయి.

  • Loading...

More Telugu News