Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది దుర్మరణం

8 dead in road accident in Chittoor district

  • రెండు లారీలను ఢీకొన్న బస్సు
  • మొగిలి ఘాట్ వద్ద ప్రమాదం
  • బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా యాక్సిడెంట్

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News