నా వైకల్యాన్ని అంతా హేళన చేసేవారు.. అథ్లెట్ జీవాంజి దీప్తి
- బాల్యంలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించిన పారాలింపిక్స్ మెడల్ విజేత
- గ్రహణం, మొర్రితో జన్మించిన దీప్తి
- వదిలించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చెప్పారన్న దీప్తి తల్లి
ఈ విషయంలో తన తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తాతయ్య తమకిచ్చిన భూమిని అమ్మేయాల్సి వచ్చిందని, అయితే, ఆసియా గేమ్స్ లో పతకం సాధించాక ఆ భూమిని తిరిగి కొనుక్కున్నామని వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్తి ఈ వివరాలు వెల్లడించారు.
దీప్తి తల్లి జీవాంజి ధనలక్ష్మి మాట్లాడుతూ.. దీప్తి మిగతా పిల్లల మాదిరిగా పుట్టలేదని, గ్రహణం మొర్రి కారణంగా ముఖం చిన్నగా, పెదవులు అసహజంగా ఉండేవని చెప్పారు. తన బిడ్డను చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఆ పసిగుడ్డును ఏదోలా వదిలించుకొమ్మని చెప్పారని గుర్తుచేసుకున్నారు. అయితే, తనకు మాత్రం దీప్తి ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని చెప్పారు. పారిస్ పారాలింపిక్స్ లో పతకం సాధించి తాను స్పెషల్ గర్ల్ నని దీప్తి ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.