Jagan: పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా ఇస్తారు?... జగన్ తో చెప్పిన యువతి... వీడియో వైరల్

Young woman replies to Jagan with very honesty on flood relief

  • విజయవాడలో పర్యటించిన జగన్
  • సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ
  • సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత
  • మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు. 

కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..."మీకు ప్రభుత్వ సాయం అందిందా... ఇంకా అందలేదా?" అని జగన్ ఓ మహిళను అడగ్గా... పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ... "నీళ్లు మెడ వరకు ఉన్నాయి... పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు" అని స్పష్టం చేసింది. 

ఈ వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.

  • Loading...

More Telugu News