Vijayawada: విజయవాడలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి బాలిక మృతి

Vijayawada Landslides One Girl Dead and many feared under the rubbles

  • మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ లో ఘటన
  • పూర్తిగా కూలిపోయిన ఇల్లు.. పలువురు లోపల చిక్కుకుపోయినట్లు అనుమానం
  • పాక్షికంగా ధ్వంసమైన మరికొన్ని ఇళ్లు

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ బాలిక మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఓ ఇల్లు పూర్తిగా, మరికొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆ ఇంట్లో పలువురు చిక్కుకుపోయారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాలలో చిక్కుకున్న ఓ యువతిని బయటకు తీస్తున్న వీడియో హృదయవిదారకంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News