Vande Bharat Trains: రేపు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will inaugurates three Vande Bharat trains tomorrow


ప్రధాని నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 31) మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. మీరట్-లక్నో (ఉత్తరప్రదేశ్), మధురై-బెంగళూరు (కర్ణాటక), చెన్నై-నాగర్ కోయిల్ (తమిళనాడు) మార్గాల్లో ఈ కొత్త వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. 

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ నూతన వందే భారత్ రైళ్లు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణకు ప్రతీకలుగా నిలుస్తాయని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మూడు వందే భారత్ రైళ్లు ఆయా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని గంటన్నర నుంచి రెండు గంటల వరకు తగ్గించనున్నాయి.

  • Loading...

More Telugu News