UPS: కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి

Centre announces Unified Pension Scheme

  • ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఎస్ స్థానంలో యూపీఎస్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
  • రాష్ట్రాలు కూడా అమలు చేస్తే 90 లక్షల మందికి లబ్ధి
  • 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్
  • కనీస పెన్షన్ రావాలంటే పదేళ్ల సర్వీసు తప్పనిసరి

ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగ విరమణ అనంతరం మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పింఛన్ పథకం (యూపీఎస్) తీసుకొచ్చింది.  దీనివల్ల దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. అదే జరిగితే లబ్ధి పొందే ఉద్యోగుల సంఖ్య 90 లక్షలకు పెరుగుతుంది.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమల్లోకి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జాతీయ పింఛన్ పథకం (ఎన్‌పీఎస్) అమల్లో ఉండగా దాని నుంచి యూపీఎస్‌కు మారేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విధానం వల్ల 25 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. అయితే, కనీస పెన్షన్ రావాలంటే మాత్రం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. యూపీఎస్ విధానంలో ఉద్యోగ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతనం (బేసిక్) సగటులో సగం పెన్షన్‌గా అందుతుంది. ఉద్యోగులు దీనిని ఎంచుకోవడం ద్వారా వారిపై అదనంగా ఎలాంటి భారమూ పడదు. ప్రస్తుతం ఉన్న 10 శాతం చందానే చెల్లిస్తే సరిపోతుంది.

  • Loading...

More Telugu News