నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన భట్టివిక్రమార్క
- బఫర్ జోనే కాదు... చెరువులోనే అక్రమ నిర్మాణాలు కట్టారన్న ఉపముఖ్యమంత్రి
- నోటీసులు ఇచ్చాకే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
- చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూసేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడి
ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అన్నారు. తాము ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నామన్నారు. అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకే తమ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు. శాటిలైట్ ఫొటోలతో సహా ప్రజల ముందు ఉంచుతామన్నారు. అక్రమ కట్టడాలపై మాత్రం తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.