Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Chandrababu visiting Tirupati and Nellore districts today

  • సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న చంద్రబాబు
  • ఈ మధ్యాహ్నం శ్రీసిటీలో పర్యటన
  • 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్నారు. జలాశయ మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి పాల్గొంటారు. 

అనంతరం ఈ మధ్యాహ్నం సత్యవేడులోని శ్రీసిటీలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1,213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతరం పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News