Uttar Pradesh: రైతుని 5 కిలోల 'బంగాళాదుంపలు' లంచం అడిగిన ఎస్సై... సస్పెండ్ చేసిన అధికారులు

A sub inspector in Uttar Pradeshs Kannauj has been suspended for demanding potatoes as a bribe

  • ఒక కేసు సెటిల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఎస్సై
  • ఎస్సై ఫోన్‌కాల్‌ను రికార్డు చేసిన రైతు
  • వైరల్‌గా మారిన ఆడియో... సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై లంచంగా ఓ రైతుని 'బంగాళదుంపలు' డిమాండ్ చేశాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. 

అయితే ఓ కేసు సెటిల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అతడు... కోడ్‌ పదంగా ‘బంగాళదుంప’ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రామ్ కృపాల్ సింగ్ అనే ఎస్సై ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఎస్సై ఫోన్ కాల్‌ను రైతు రికార్డు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఎస్సై ఆడియో వైరల్‌గా మారింది.

కన్నౌజ్ జిల్లా సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చౌకీలో అతడు విధులు నిర్వహిస్తూ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని, దీంతో అతడిని కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో సదరు ఎస్సైపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్టు వెల్లడించారు. కన్నౌజ్ సిటీ సర్కిల్ అధికారి కమలేశ్ కుమార్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు.

కాగా వైరల్ ఆడియోలో ఆ ఎస్సై బాధిత రైతుని 5 కిలోల ‘బంగాళాదుంపలు’ అడగగా.. తాను అన్ని ఇవ్వలేనని రైతు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై తన ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రైతు 2 కిలోలు ఇస్తానని అన్నాడు. పోలీసు అధికారి కోపం తెచ్చుకుని తన అసలు డిమాండ్‌ను నొక్కి చెప్పాడు. దీంతో ఫైనల్‌గా 3 కిలోలు తీసుకునేందుకు ఎస్సై ఒప్పుకున్నాడు.

  • Loading...

More Telugu News